Friday, March 29, 2024

ఒలింపిక్స్ ఎఫెక్ట్..?టోక్యోలో భారీగా కరోనా కేసులు..

టోక్యోలో కరోనా కేసులు మరోమారు భయపెట్టే స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో నేడు ఏకంగా 2,848 కేసులు నమోదయ్యాయి. ఆదివారం టోక్యోలో 12,635 మంది కరోనాతో ఆసుపత్రులలో చేరారు. మహమ్మారి మొదలైన తర్వాత టోక్యోలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, నేడు ఒలింపిక్స్‌తో సంబంధం ఉన్న ఏడు కేసులు వెలుగుచూశాయి. వీరిలో నలుగురు అథ్లెట్లు కాగా, ఒలింపిక్ గ్రామంలోని ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఒలింపిక్ అథ్లెట్లు, ఇతరులు ఇప్పటికే 155 మంది కరోనా బారినపడ్డారు. దీంతో క్రీడలను రద్దు చేయాలంటూ టోక్యో వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కరోనా బారినపడిన అథ్లెట్లు, ఇతరుల వల్ల కేసులు మరింత ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాసాకు భారీ ఆఫర్ ప్రకటించిన జెఫ్ బెజోస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement