దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాడు ప్లాట్గా ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు ఒడుదొడుకుల మధ్య చలించాయి. గురువారం నాడు మార్కెట్లు గరిష్టస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభల స్వీకరణకు దిగారు. కీలక రంగాల్లో భారీ ఎత్తున అమ్మకాలు జరిగాయి. దీంతో చివరకు మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 20.96 పాయింట్ల లాభంతో 62293.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.65 పాయింట్లు లాభంతో 18512.75 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 103 రూపాయలు తగ్గి 52568 వద్ద ట్రేడయ్యింది. వెండ కిలో ధర 373 రూపాయలు తగ్గి 61620 వద్ద ట్రేడయ్యింది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 81.75 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బాంక్, విప్రో, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ, టాటా స్టీల్, ఎంఅండ్ ఎం, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఎన్టీపీసీ, అల్ట్రా సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
నెస్లే ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి.