Thursday, April 25, 2024

ఎవరో కట్టిన ట్యూన్ కు.. పవన్ రాగం.. సజ్జల

ఎవరో కట్టిన ట్యూన్ కు పవన్ కల్యాణ్ రాగం అందుకున్నట్లు ఉందని ఏపీలో పొత్తులపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం పవన్ బ్రోకరిజం చేస్తున్నట్లుందన్నారు. బీజేపీ, జనసేన పొత్తుల గురించి మాకు సంబంధం లేదన్నారు. సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటే ఆప్షన్లు ఎందుకు అని ప్రశ్నించారు. ఉనికిని చాటుకోవడానికి వారి ప్రయత్నమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement