Wednesday, March 27, 2024

మెజారిటీ స్థానాల్లో టీఎంసీ లీడింగ్

ముచ్చటగా మూడవ సారి పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికార పీఠాన్ని అధిగమించే దిశగా నడుస్తున్నారు. ఎనిమిది విడతలుగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 138 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 33 స్థానాల్లో ఇంకా తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి కాలేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, దానికి 10 స్థానాల దూరంలో తృణమూల్ ఉంది. మరో 33 చోట్ల ట్రెండ్స్ రావాల్సి వుండగా, వాటితో మేజిక్ ఫిగర్ ను మమతా బెనర్జీ సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితాల సరళిలో అనూహ్య మార్పులు సంభవిస్తే తప్ప తృణమూల్ అధికారంలోకి రాకుండా ఆపలేరని భావించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement