Saturday, April 20, 2024

Tirupathi – రేపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక … చీఫ్ గెస్ట్ గా చిన జియ‌ర్ స్వామిజీ

ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ రూపొందించిన‌ ‘ఆదిపురుష్. సీతారాములుగా ప్రభాస్ – కృతి సనన్ నటించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు ‘తిరుపతి’లో నిర్వహించ‌నున్నారు..

‘శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం’లో ఈ వేడుకను అత్యంత ఘనంగా జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా త్రిదండి చినజీయర్ స్వామి హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement