Saturday, April 20, 2024

140కోట్ల‌కు అమ్ముడుపోయిన టిప్పు సుల్తాన్ ఖ‌డ్గం

లండన్‌లో జరిగిన ఒక వేలంలో 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ బెడ్‌చాంబర్ కత్తి 14 మిలియన్ పౌండ్లకు (140 కోట్లు) అమ్ముడుపోయింది. టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దపు చివరిలో జరిగిన యుద్ధాలలో ఖ్యాతిని పొందాడు. అతను 1775 – 1779 మధ్య అనేక సందర్భాల్లో మరాఠాలకు వ్యతిరేకంగా పోరాడాడు. టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని రక్షించిన క్రూరత్వానికి “టైగర్ ఆఫ్ మైసూర్” అనే మారుపేరును పెట్టారు.

టిప్పు సుల్తాన్‌ను మ‌రణించిన‌ తర్వాత, అత‌ని రాజభవనంలోని ప్రైవేట్ క్వార్టర్‌లో కత్తి దొరికింది. అతని ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బైర్డ్‌కు అతని ధైర్యానికి చిహ్నంగా సమర్పించినట్లు వేలం సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement