Tuesday, April 23, 2024

త్రీ రోజెస్ ట్రైల‌ర్.. రిలీజ్ చేసిన ర‌కుల్ ..

ఇప్పుడంతా ఓటీటీల బాట ప‌డుతున్నారు. ద‌ర్శ‌కుడు మారుతీ త్రీ రోజెస్ పేరుతో ఓ వెబ్ సీరిస్ ని తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం మారుతీ ఈ వెబ్ సీరీస్ ని రూపొందిస్తున్నాడు. నవంబర్‌ 12 న ఆహాలో విడుదల కానుంది. ఇందులో టైటిల్‌ రోల్‌ ను పూర్ణ, ఇషారెబ్బా, పాయల్‌ రాజ్‌ పుత్‌ పోషిస్తున్నారు..డిజిటల్‌ మాధ్యమంలో ముగ్గురు హీరోయిన్స్‌ నటిస్తోన్న తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే. రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ ను మ్యాగీ డైరెక్ట్‌ చేశారు. టాక్సీవాలా సినిమాను నిర్మించిన ఎస్‌కెఎన్‌ యాక్షన్‌ కట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్‌ పీ బ్యానర్‌ పై 3 రోజెస్‌ వెబ్‌ సీరిస్‌ ను నిర్మిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ను టాలీవుడ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ లో ముగ్గురు హీరోయిన్లు… తమ‌ అందాలను ఆరబోశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement