Friday, April 19, 2024

ఖమ్మం జిల్లాలో ముగ్గురి ప్రాణం తీసిన కల్తీ మద్యం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రుతండా గ్రామంలో బంధువుల కర్మకాండల కార్యక్రమానికి హాజరైన ముగ్గురు వ్యక్తులు కల్తీ మద్యం సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కాగా మృతులందరూ చంద్రుతండాకు చెందిన బోడా హరిదాసు (55), బోడా మల్సూర్ (55), బోడా భద్రు (35)గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు పర్యటించి మృతులు సేవించిన మద్యం శాంపిళ్లను సేకరించే పనిలో పడ్డారు.

ఈ వార్త కూడా చదవండి: తిరుమలలో శిలువ గుర్తు కలకలం

Advertisement

తాజా వార్తలు

Advertisement