Thursday, April 25, 2024

జ‌న‌గామ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

జనగామ మండలం పెంబర్తి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. దీంతో డీసీఎం డ్రైవర్, క్లీనర్, కారులో ఉన్న ఆరేళ్ల పాప మృతి చెందారు. కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. డీసీఎం వాహనం టైరు పంచారు కావడంతో టైరు మారుస్తుండగా కారు వ‌చ్చి ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement