Thursday, April 25, 2024

ప్రమాదం చూసేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు

గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం గామాలపాడు గణపతి కోల్డ్ స్టోరేజ్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. వాటిని చూసేందుకు బైకుపై వచ్చిన నలుగురిని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతులు గామాలపాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement