Thursday, April 18, 2024

శభాష్…ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు భలే వెళ్తున్నారు

ఇటీవల కాలంలో హెల్మెట్ లేకుండా బైక్ పై వచ్చినా, త్రిబుల్ రైడింగ్ చేసిన… పోలీసులు ఫైన్ లు వేస్తున్నారు. లేదంటే ఫోటోలను ఇంటికి పంపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. సామాన్యులకు ఫైన్ లు వేసే పోలీసులు వారు మాత్రం హెల్మెట్ లేకుండా త్రిబుల్ రైడ్ చేసేస్తున్నారు. ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన షర్మిల సభ కోసం ఓ ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించేందుకు బైక్పై వెళ్తున్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. అలాగే హెల్మెట్ పెట్టుకోలేదు. అంతకు తోడు త్రిబుల్ రైడ్ చేశారు. మొత్తం ఒకటి కాదు రెండు కాదు మూడు నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు పై ప్రయాణిస్తున్న ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటోను చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ఈ మహిళా కానిస్టేబుల్ పై ఖమ్మం ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఫైర్ అయ్యారు. 3300 రూపాయలు జరిమానా విధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement