Thursday, April 25, 2024

మూడు రోజుల పాటు SBI ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తన ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. వివిధ నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు అందించే వివిధ సేవల్లో మూడు రోజుల పాటు అంతరాయం కలగనుందని తెలిపింది. ఈ నెల 21వ తేదీ రాత్రి 10:45 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 1:15 గంటల వరకు THRఅంటే రెండున్నర గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం కలుగుతుందని తెలిపింది. 23వ తేదీ తెల్లవారు జామున 2:40 గంటల నుంచి 6:10 గంటల వరకు అంటే దాదాపు మూడున్నర గంటల పాటు బ్యాంకు సేవలు పనిచేయవని తెలిపింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement