Thursday, April 18, 2024

కడప జిల్లాలో విషాదం.. పెన్నా నదిలో నలుగురు చిన్నారులు గల్లంతు

కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వ‌ల్లూరు మండ‌లం పుష్ప‌గిరి వ‌ద్ద పెన్నాన‌దిలో గురువారం నాడు న‌లుగురు చిన్నారులు గల్లంతయ్యారు. చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు గ‌జ ఈత‌గాళ్ల స‌హాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటివరకు ముగ్గురి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. మ‌రొక‌రి మృత‌దేహం కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల్లో అబ్దుల్ ర‌షీద్(18), జ‌వేరియా(12), అనుస్ ఖాన్‌(15) ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు అన్నాచెల్లెళ్లు.

కాగా అబ్దుల్ వ‌లీద్ ఖాన్‌(19) మృత‌దేహం ల‌భ్యం కావాల్సి ఉంది. కాగా పోస్టుమార్టం నిమిత్తం దొరికిన మృత‌దేహాల‌ను పోలీసులు రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా క‌డ‌ప ప‌ట్ట‌ణానికి చెందిన రెండు కుటుంబాలు విహారయాత్ర నిమిత్తం గురువారం సాయంత్రం పుష్ప‌గిరికి వ‌చ్చార‌ని వ‌ల్లూరు ఎస్ఐ రాజ‌గోపాల్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే చిన్నారులు న‌దిలో ఆడుకుంటుండ‌గా గ‌ల్లంత‌య్యార‌ని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మచిలీపట్నంలో మైనర్ బాలికలు అదృశ్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement