Friday, March 29, 2024

ఎమ్మెల్సీ క‌విత‌తో బిఆర్ఎస్ ఎపి అధ్య‌క్షుడు తోట భేటి..

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో భేటి అయ్యారు.. ఎపి అధ్య‌క్షుడిగా నియ‌మితులైన అనంత‌రం ఆయ‌న మ‌ర్యాద‌పూర్వ‌కంగా నేడు క‌విత‌ను హైద‌ర‌బాద్ లోని ఆమె నివాసంలో క‌లిశారు.. ఆయ‌న‌తో పాటు ఎపి నేత‌లు రావెల కిశోర్ బాబు, పార్థ‌సార‌థి ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులు, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఖమ్మంలో నిర్వ‌హించ‌నున్న తొలి బిఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌కు ఎపి నుంచి భారీగా ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించన‌న్న‌ట్లు ఎపి నేత‌లు క‌విత‌కు వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement