Thursday, March 28, 2024

ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌ రెడ్డి

ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు ముఖ్యమైనదని, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఉగాది పర్వదినం సందర్భంగా ఓ నిర్ణయం తీసుకోవాల‌ని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించాల‌న్నారు. ఈరోజు నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని సందర్శనశాలగా మారుస్తున్నాం. దీన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 11నెలల పాటు రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ నెల తప్ప మిగతా రోజుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండదు అని కిషన్‌ రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement