Thursday, April 25, 2024

ఇదే చివరి అవకాశం….జగన్ కు సీబీఐ కోర్ట్ హెచ్చరిక

జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఏ వన్ ముద్దాయిగా ఉన్న జగన్ బెయిల్ ను రద్దు చేయాలని గతంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై గతంలో విచారణ చేసిన సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జగన్, సీబీఐ ని ఆదేశించింది.

ఇక మరోసారి కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని జగన్, సీబీఐ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ఇదే చివరి అవకాశం అంటూ విచారణ 26కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement