Thursday, April 18, 2024

ఇది గ‌ర్ల్స్ గ్యాంగ్.. ఫొటోస్ పోస్ట్ చేసిన న‌మ్ర‌త‌

ఇది గ‌ర్ల్స్ గ్యాంగ్ అంటోంది సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌త‌. వివ‌రాల్లోకి వెళ్తే సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్తుంటారు మ‌హేశ్ బాబు ఫ్యామిలీ. తన ట్రావెల్స్‌కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం మహేశ్‌ ఫ్యామిలీ ప్యారిస్‌లో చక్కర్లు కొడుతోంది.మహేష్ బాబు సతీమణి నమ్రత, సితార ఇతర కుటుంబ సభ్యులు పారిస్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన నమ్రత దీనికి ‘గర్ల్స్ గ్యాంగ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.’సర్కారు వారి పాట’ విజయం తర్వాత మహేశ్‌ బాబు కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే బిజీగా ఉంటున్నాడు మహేశ్‌. అందుకే అతను తప్ప ఇతర కుటుంబ సభ్యులు విదేశీ విహారయాత్రకు బయలు దేరారు. ప్రస్తుతం మహేశ్‌ ఫ్యామిలీ ప్యారిస్‌ టూర్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement