Friday, April 19, 2024

టెక మహీంద్ర చేతికి థర్డ్‌వేర్‌ సొల్యూషన్స్ ..

టెక్‌ మహీంద్ర ముంబైకి చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ థర్డ్‌వేర్‌ సొల్యూషన్స్‌ను టేకోవర్‌ చేయనుంది. థర్డ్‌వేర్‌కు చెందిన వందశాతం స్టేక్స్‌ను కొనుగోలు చేయనుంది. ఈక్రమంలో 42మిలియన్‌ డాలర్లను ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ మేరకు టెక్‌ మహీంద్ర బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌..సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కాగా ముంబైకి చెందిన ఐటీ సర్వీసెస్‌ కంపెనీ థర్డ్‌వేర్‌ సొల్యూషన్స్‌ను 1995లో ఏర్పాటు చేశారు. 850మందికిపైగా ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌, ఎంటర్‌ప్రైజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, ఇండస్ట్రియల్‌ ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సహ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు బిజినెస్‌ అప్లికేషన్స్‌, కన్సల్టింగ్‌, ఇంప్లిమెంటేషన్‌ అండ్‌ సపోర్ట్‌ సేవలను అందిస్తోంది.

ఎర్న్‌ అవుట్స్‌తో కలిపి ఈ కంపెనీనీ వందశాతం టేకోవర్‌ చేయాలని టెక్‌ మహీంద్ర నిర్ణయించింది. ఈ ఏడాది మే 31వ తేదీనాటికి టేకోవర్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని టెక్‌ మహీంద్ర తెలిపింది. గతే మూడేళ్లుగా థర్డ్‌వేర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ నిలకడగా లాభాలను నమోదు చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో థర్డ్‌వేర్‌ సొల్యూషన్స్‌ 210.62కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి 226.5కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement