Wednesday, April 24, 2024

విశాఖ‌లో మూడో టీ20 మ్యాచ్ – హాట్ కేక్ ల్లా అమ్ముడుపోయిన టికెట్స్

విశాఖ‌ప‌ట్నంలో ఈ నెల 14న మూడో టీ-20మ్యాచ్ కి ఆన్ లైన్ లో టికెట్ల‌ని విక్ర‌యించారు. కాగా ఈ మ్యాచ్ భార‌త్ ..ద‌క్షిణాఫ్రికాల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. అయితే ఆన్ లైన్ లో ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌య్యాయి. రూ. 500 నుంచి రూ. 6వేల వరకు టికెట్లను ఆన్‌లైన్ లో పెట్టగా 80శాతం టికెట్లు అమ్ముడుపోయాయి . ఈనెల 8న స్టేడియం దగ్గర మిగత 20 శాతం టికెట్లను విక్రయించనున్నారు.ACA-VDCA స్టేడియంలో జరుగనున్న డే అండ్ నైట్‌ మ్యాచ్‌కు ఆంధ్ర క్రికెట్‌ అసోసియోషన్‌, అధికారులు, పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్టేడియం సామర్థ్యం 27, 251 కాగా ఆన్‌లైన్‌లో 80 శాతం టికెట్లు అమ్ముడు పోయాయి. కొవిడ్‌ అనంతరం తొలిసారిగా విశాఖలో జరుగుతున్న మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 15వందల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement