Saturday, April 20, 2024

పట్టపగలే చోరీ.. గంట వ్యవధిలో ఇంటిని దోచేసిన దొంగలు

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఓ ఇంట్లో జరిగింది. గాజులరామారం సర్కిల్ నెహ్రూనగర్‌కు చెందిన ముత్యాలమ్మ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి సొంత పనులపై ఎల్లమ్మ బండకు వెళ్లింది. అయితే గంట తర్వాత ఇంటికి వచ్చే చూసే సరికి ఇంటి తాళం ధ్వంసం చేసి తలుపులు తీసి ఉన్నాయి.

దీంతో తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఆమె గుర్తించింది. లోపలకు వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరుచుకుని ఉండటంతో అందులోని 5 గ్రాముల బంగారపు ఉంగరం, రూ.20వేల నగదు మాయమయ్యాయి. ఈ మేరకు ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement