Friday, March 29, 2024

ఏటీఎంలో చోరీకి యత్నం.. పోలీసులు రావడంతో పరారైన దొంగ

హైదరాబాద్‌లో వరుస చోరీ ఘటనలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మొన్న కూక‌ట్‌ప‌ల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వ‌ద్ద దొంగ‌త‌నం, నిన్న గండిమైస‌మ్మ వ‌ద్ద ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసు గోడ‌కు క‌న్నం.. నేడు కృష్ణా న‌గ‌ర్‌లోని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి య‌త్నం.. ఇలా వ‌రుస ఘ‌ట‌నలు హైద‌రాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

కృష్ణాన‌గ‌ర్‌లోని పంజాబ్ నేష‌న్ బ్యాంకు ఏటీఎం వ‌ద్ద‌కు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు ఓ యువ‌కుడు బైక్‌పై వ‌చ్చాడు. ఆ త‌ర్వాత స్క్రూ డ్రైవ‌ర్ల‌తో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు య‌త్నించాడు. అంత‌లోనే పోలీసు పెట్రోలింగ్ వాహ‌నం అటుగా రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఆ దొంగ‌.. బైక్‌పై ప‌రారీ అయ్యాడు. విష‌యాన్ని గ‌మ‌నించిన పోలీసులు.. అక్క‌డున్న సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించారు. అయితే దొంగ ఎస్ఆర్ న‌గ‌ర్ వైపు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఏటీఎం టెక్నిషీయ‌న్‌గా ప‌ని చేసిన యువ‌కుడే ఈ చోరీకి య‌త్నించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement