Friday, April 19, 2024

హైదరాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్ నగరంలో శనివారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కుల్సుంపురాలోని జియాగూడ వెంక‌టేశ్వ‌ర‌న‌గ‌ర్ కాల‌నీలో దుండ‌గులు ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఐదు ఇళ్ల‌లో రూ.20 ల‌క్ష‌ల న‌గ‌దు, 45 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని చోరీ జ‌రిగిన ఇళ్ల‌లో క్లూస్ టీమ్‌తో ప‌రిశీలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement