Friday, March 29, 2024

Ap | కొడ‌లిపై క‌న్నేసిన మామ‌.. లైంగిక వేధింపులు తట్టుకోలే భ‌ర్త‌తో క‌లిసి హ‌త‌మార్చిన‌ కోడ‌లు!

పిచ్చాటూరు, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తండ్రిని భార్యతో కలిసి దారుణంగా హతమార్చి పాడు పడిన బావిలో పడేసిన ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా, పిచ్చాటూరులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.. పుత్తూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పిచ్చాటూరు మండలం పులికుండ్రం గ్రామానికి చెందిన తంగారాజ్ (60).. అత‌ని కొడుకు సత్యరాజు, కోడలు అరుల్ జ్యోతితో క‌లిసి ఉంటున్నాడు. తండ్రి పేరు మీద ఉన్న ఆస్థి బదలాయింపు విషయమై తండ్రి కొడుకుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అదలా ఉండగానే .. తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళ పేరుమీద తన ఆస్థి రాస్తాన‌ని చెప్పే తంగారాజ్ ఆ ఆస్తి కావాలంటే తనకు లొంగాలని కోడలు అరుల్ జ్యోతిని వేధించడం మొదలు పెట్టాడు.

ఈ విషయాన్ని భర్త సత్యారాజ్ తో చెప్పినా ప‌ట్టించుకోలేదు. దీంతో అరుల్‌ జ్యోతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.. ఆపై తండ్రి ప్రవర్తనను స్వయంగా చూసిన సత్యారాజ్ తండ్రిని హేచ్చరించాడు. అయినా అత‌ని ప్రవర్తన మారకపోవడంతో భార్యాభర్తలు తంగరాజ్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. పధకం ప్రకారం గత జులై 23వ తేదీన‌ తంగరాజు కమ్యూనిటీ హాల్లో నిద్రిస్తుండగా.. కుమారుడు సత్యరాజు, కోడలు అరుల్ జ్యోతి కత్తితో నరికి హత్య చేసి బావిలో పడేశారు. ఆ త‌ర్వాత ఏమీ తెలియనట్టు నటించారు.

అనుమానాస్ప‌ద‌ మృతిగా కేసు నమోదు చేసిన‌ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దర్యాప్తులో నిజం బయట పడిందని, నిందితులిద్ద‌రు నేరం అంగీకరించారని సీఐ సురేష్ కుమార్ తెలిపారు. హత్య కేసు ఛేదించడంలో పిచ్చాటూరు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, వడమాల పేట ఎస్సై రామాంజనేయులు, ఏఎస్సై వెంకటరాజుతోపాటు ఇత‌ర సిబ్బంది, క్రైం డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా జిల్లా అధికారులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement