Thursday, March 28, 2024

అక్కా చెల్లెళ్లిద్ద‌రినీ కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన దుండగులు

అక్కా చెల్లెళ్లను కిడ్నాప్ చేసిన దుండగులు వారిని దారుణంగా రేప్ చేశారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. ఇందులో ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ వారిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా ధర్నావాడ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మూడు రోజుల క్రితం ఓ రోజు మధ్య రాత్రి ఇద్దరు మైనర్లు అయిన‌ అక్కా చెల్లెల్లను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. నిందితుల్లో ఒకడు అక్కాచెల్లెళ్లను పాఠశాలకు తీసుకెళ్లి తిరిగి వచ్చేవాడు. అతడు తన స్నేహితుడైన మ‌రో 16ఏళ్ల‌ బాలుడి సాయం తీసుకున్నాడు. వారిని కిడ్నాప్ చేయడానికి మత్తు మందును ఉపయోగించారు.

ఆ త‌ర్వాత వారిని ఎవ‌రూలేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితుల్లో ఒకడి వయస్సు 13 ఏళ్లు. కాగా.. మరొకడి వయస్సు 17 సంవత్సరాలు. ఈ ఘటనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ శ్రీవాస్తవ కోర్టులో సమర్పించిన ఆధారాల ప్రకారం.. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 376 (రేప్), ఇతర సంబంధిత కేసులు నమోదు చేశారు.

కాగా.. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేయ‌నున్న‌ట్టు ధర్నావాడ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి గోపాల్ చౌబే తెలిపారు. బాలికలను కిడ్నాప్ చేసే సమయంలో నిందితులు వారికి మత్తు మందు ఇచ్చి, దాన్ని పీల్చేలా చేశారన్నారు. ఆ త‌ర్వాత‌ వారిని సమీపంలోని ఓ మ‌రుగు ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. రేప్ చేసిన త‌ర్వాత నిందితుల‌ను బాలిక‌ల‌ను తీవ్రంగా హెచ్చ‌రించార‌ని, ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే వారి కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement