Friday, April 19, 2024

మూడు టిమ్స్‌ ఆసుపత్రుల టెండర్లు ఖరారు.. నిర్మాణ సంస్థలకు పనుల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నగరం చుట్టూ ప్రతిపాదిత సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల (టిమ్స్‌ ఆసుపత్రులు) నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.2679 కోట్లను మంజూరు చేసింది. ఆసుపత్రుల నిర్మాణానికి కావాల్సిన టెండర్ల ప్రతిపాదనలను టెండర్ల విభాగం కమిషనరేట్‌ ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌(రంగారెడ్డి) నిర్మాణ పనులను రూ.668 కోట్లతో లార్సెన్‌ టర్బో సంస్థ , సనత్‌ నగర్‌(హైదరాబాద్‌ జిల్లా) టిమ్స్‌ ను రూ.667 కోట్లతో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ, అల్వాల్‌టిమ్స్‌(మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా) ను డీఈసీ సంస్థ రూ.669 కోట్లతో నిర్మించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement