Friday, April 19, 2024

మ్యాచ్ ఓటమితో పాటు కోహ్లీ కి మరో షాక్ !!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లో వరుస విజయాలను సాధించింది. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొట్టమొదటి ఓటమిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 69 పరుగులు తేడాతో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

ఇదిలా ఉండగా కెప్టెన్ కోహ్లీ కి మరో షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. దీంతో కింగ్ కోహ్లీ కి 12 లక్షల జరిమానాను విధించారు. ఇక ఇదే తప్పు మూడు సార్లు జరిగితే ఒక మ్యాచ్ నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా స్లో ఓవర్ రేట్ విషయంలో గతంలో ధోనికి, రోహిత్ శర్మకి, కోల్ కత్త కెప్టెన్ మోర్గాన్ కు కూడా జరిమాన పడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement