Thursday, April 18, 2024

ఎగ్జామ్​కి ప్రిపేర్ కాలేద‌ని విద్యార్థిని కొట్టిన టీచర్​.. దెబ్బలు తట్టుకోలేక చనిపోయిన స్టూడెంట్​

గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. పరారీలో ఉన్న నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితుడు సోరెన్, అక్టోబర్ 6న ఓ పరీక్షకు సిద్ధం కావాల‌ని విద్యార్థులకు చెప్పాడు. మరుసటి రోజు బాధితుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోవడంతో ఆగ్రహించిన టీచ‌ర్ బాలుడి తలపై, వీపుపై నిర్దాక్షిణ్యంగా కొట్టాడని, ఆ తర్వాత బాలుడు స్పృహతప్పి పడిపోయాడని అధికారులు తెలిపారు.

మొద‌ట దాద్రిలోని నవీన్ ఆసుపత్రిలో విద్యార్థిని అడ్మిట్ చేశారు. ఆపై బాధితుడిని ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. బలమైన దెబ్బల కారణంగా బాలుడి తలలోని మూడు సిరలు పగిలిపోయాయని డాక్టర్లు వెల్లడించారు. దెబ్బ‌లుతిన్న విద్యార్థి ఆదివారం సాయంత్రం చనిపోయాడు. కాగా, ఆ విద్యార్థి మరణానికి కారణమై.. పరారీలో ఉన్న ఉపాధ్యాయుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement