Friday, April 19, 2024

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో తెలుగు క్రీడాకారుల ప్రతిభ.. 25 స్వర్ణ పతకాలు కైవసం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయస్థాయి ఈత పోటీలో ఏపీ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 4న గచ్చిబౌలిస్టేడీయంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈ జాతీయస్తాయి పోటీలు జరగ్గా ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట డ్రీమర్స్‌ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌కు చెందిన 13 మంది క్రీడాకారులు కోచ్‌లు లక్ష్మీ-పాండురంగారావు నేతృత్వంలో 39 పథకాలు సాధించారు.

ఇందులో 25 స్వర్ణ పథకాలు, 13 రజతం, 1 కాంస్యం పథకం ఉన్నాయి. కోచ్‌ పొట్టాబత్తిని లక్ష్మీ స్వర్ణ పథకాలు 3, ఏనుగుల సీతారావమ్మ 2 స్వర్ణ పథకాలు, ఎస్‌. ఆదీ లక్ష్మీ 2 స్వర్ణాలు, ఒక రజతం గెలిచారు. వీరితో కలిపి మొత్తం 13 మంది క్రీడాకారులు స్వర్ణ పథకాలను సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement