Saturday, April 20, 2024

మోడీ బ‌ర్త్ డేకి బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన రెస్టారెంట్..40నిమిషాల్లో తాలీని తింటే రూ.8.5ల‌క్ష‌ల బ‌హుమ‌తి

సెప్టెంబ‌ర్ 17న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పుట్టిన‌రోజు. ఈసంద‌ర్భంగా బంప‌ర్ ఆఫ‌ర్ ని ప్ర‌క‌టించింది ఓ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో రూపొందించిన ప్రత్యేక తాలీని 40 నిమిషాల్లో లాగించిన వారికి రూ.8.5 లక్షలు ఇస్తామని వెల్లడించింది. ఈ రెస్టారెంట్ పేరు ఆర్డర్ 2.0 .. ఇది కన్నాట్ ప్లేస్ లో ఉంది. దీని యజమాని సుమిత్రా కల్రా స్పందిస్తూ… మోడీని తాము ఎంతో గౌరవిస్తామని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నామని, అందుకే తాలీ పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకమైన తాలీకి ’56 అంగుళాల మోడీజీ’ అని పేరు పెట్టినట్టు వివరించారు. ఈ పోటీలో దంపతులు పాల్గొనవచ్చని, వారిలో ఏ ఒక్కరైనా 40 నిమిషాల్లోపు తాలీ మొత్తం తింటే వారికి రూ.8.5 లక్షల రివార్డు అందజేస్తామని వెల్లడించారు. అంతేకాదు, సెప్టెంబరు 17వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య తమ రెస్టారెంట్ లో తాలీ భుజించిన వారిలో లక్కీ విన్నర్ కు కేదార్ నాథ్ పర్యటన అవకాశం కల్పిస్తామని సుమిత్ర కల్రా వెల్ల‌డించారు. మ‌రి ఈ పోటీల్లో పాల్గొని గెలిచేవారు ఎవ‌రో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement