Thursday, April 25, 2024

ఏకైక బీర్‌ అండ్‌ బ్రూవింగ్‌ ఇండిస్టీ ఈవెంట్‌ బ్రూవర్‌ వరల్డ్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : బ్రూవర్‌ వరల్డ్‌ (బీడబ్ల్యూ) కాంక్లేవ్‌ -2022 భారతదేశంలో బీర్‌, బ్రూవింగ్‌ ఇండస్ట్రీకి అంకితమైన మొట్టమొదటి ఏకైక కార్యక్రమం మే 26నుంచి 28 వరకు బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌లోని కేటీపీఓలో జరుగుతుంది. ఈసందర్భంగా బ్రూవర్‌ వరల్డ్‌ సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనితా రఘునాథ్‌ మాట్లాడుతూ… బ్రూవర్‌ వరల్డ్‌ కాంక్లేవ్‌ 2022 మొదటి ఎడిషన్‌ను నిర్వహించడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ సంఘటనతో బీరు ఎన్నాళ్ల నుంచో కోల్పోయిన గుర్తింపును ఇవ్వాలని తాము కోరుకుంటున్నామన్నారు. 2021లో భారతీయ బీర్‌ పరిశ్రమ 14,981 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. మార్కెట్‌ ఏటా 10.14శాతం (సీఏజీఆర్‌ 2021-2025) పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కేవలం పదేళ్లలోనే భారతదేశం 250కి పైగా బ్రూ పబ్‌లను అభివృద్ది చేసిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement