Friday, April 19, 2024

దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్‌ దమ్మాయిగూడలో చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇందు మరణం ప్రమాదవ శాత్తు జరిగిందని.. హత్య కాదని పోలీసులు తేల్చారు. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు వెల్లడించారు. జవహర్‌నగర్‌కు చెందిన ఇందు.. ఈ నెల 15న దమ్మాయిగూడలోని స్కూల్‌కు వెళ్లి అదృష్యమైంది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆమె మృతదేహాన్ని దమ్మాయిగూడలోని అంబేద్కర్‌నగర్‌ చెరువులో గుర్తించిన విషయం తెలిసిందే. కాగా మూత్ర విసర్జన కోసం చిన్నారి.. చెరువు దగ్గరకి వెళ్లిందని చెప్పారు. ఆ సమయంలో కాలు జారి పడిపోయినట్లు తెలిపారు. ఇందు ఊపిరితిత్తుల్లోకి చెరువు నీరు వెళ్లిందన్న పోలీసులు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వైద్యులు ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement