Thursday, April 25, 2024

రేపు ప్రారంభం కానున్న మిస్ యూనివర్స్ పోటీలు.. ఇండియా తరఫున పోటీ పడనున్న కర్ణాటక బ్యూటీ

కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల దివితా రాయ్.. ఈ నెల 15న జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున పోటీ పడనుంది. మిస్ యూనివర్స్ 71 ఎడిషన్ గ్రాండ్ ఫినాలే న్యూ ఓర్లీన్స్‌లో జనవరి 15, 6:30 AMన ( భారత కాలమానం ప్రకారం జనవరి 14, శనివారం రాత్రి 8 గంటలకు) మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ కాంటెస్ట్ లో దివితా రాయ్ తో పాటు 85 మంది పాల్గొంటారు.

2022 ఆగస్టు 28న ‘మిస్ దివా యూనివర్స్ 2022’ టైటిల్‌ను గెలుచుకుంది దివితా. అంతే కాక 2021లో జరిగాన ‘మిస్ దివా యూనివర్స్’ లో రన్నరప్‌గా నిలిచింది. దివితా రాయ్ ముంబైలోని సర్ JJ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దాంతో పాటు మోడలింగ్‌ను కూడా కొనసాగించింది. అదనంగా, ఆమెకు బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, పెయింటింగ్, సంగీతం వినడం, చదవడం వంటి వాటిపై అపారమైన ఆసక్తి ఉంది.

ఈ గ్రాండ్ ఈవెంట్‌ను JKN18 ఛానెల్ అధికారిక Facebook /YouTube ఛానెల్‌లలో లైవ్ చూడవచ్చు, అలాగే VIACOM 18 యాజమాన్యంలోని Vootలో ప్రసారం చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement