Friday, April 19, 2024

గోవా తీరంలో కుప్పకూలిన మిగ్‌.. సాంకేతిక కారణమన్న నేవీ

భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29 కె విమానం గోవా తీరంలో కుప్పకూలింది.ఈ ఘటనలో పైలట్‌ క్షేమంగా బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని నేవీ అధికారులు భావిస్తున్నారు. కాగా, మిగ్‌-29కె రకర యుద్ధవిమానాలు 2019లో ఇండియన్‌ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి. విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. నేవీ అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టడం వలన పైలట్‌ సురక్షింతంగా బయటపడ్డాడు.

శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్‌ ఎంక్వైరీని ఆదేశించారు. రష్యాలో తయారైన మిగ్‌-29కెను ప్రపంచంలోనే అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్‌ హ్యాండిల్‌ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్‌ ముందుకు ఎజెక్ట్‌ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం దీని ప్రత్యేకత.

Advertisement

తాజా వార్తలు

Advertisement