Friday, March 29, 2024

అనాధాశ్రమంలో 45 మంది విద్యార్థులకు కరోనా – గ్రేటర్ లో పంజా

తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తిచెందుతుంది. నిన్న మొన్నటి వరకు వందలలో నమోదైన కరోనా కేసులు… వెయ్యి మార్క్ ని క్రాస్ చేశాయి. తాజాగా హైదరాబాద్ ఎల్ బి నగర్ లో ఈ మహమ్మారి పంజా విసిరింది. ఓ అనాధాశ్రమంలో 45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

మొత్తం వంద మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా… 45 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్ కు తరలించారు. మిగిలిన విద్యార్థులను క్వారంటైన్ లో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement