Thursday, April 25, 2024

భార్య‌ను వేధిస్తున్న యువ‌కుడిని చంపిన భ‌ర్త‌

ఓ యువ‌కుడు త‌న భార్య‌ను త‌ర‌చూ వేధిస్తుండ‌డంతో ఆ భ‌ర్త అత‌న్ని ప‌లుమార్లు హెచ్చ‌రించాడు. అయిన‌ప్ప‌టికీ ఆ యువ‌కుడు అత‌ని భార్య‌పై వేధింపులు ఆప‌క‌పోవ‌డంతో ఆ యువ‌కుడిని హ‌త్య చేసి, శ‌వాన్ని కాల్చేసిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కంబాలహళ్లి గ్రామంలో జ‌రిగింది.
క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర్ వాసి తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణతో ఓ యువకుడిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రాత్రికి రాత్రే కాల్చి బూడిద చేశాడు. శంకర్​ (28) తరచుగా అశోక్ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయంలో శంకర్​ను అశోక్ పలుమార్లు హెచ్చరించాడు​. అయినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్​.. శంకర్​ను పదునైన ఆయుధంతో చంపేసి, శవాన్ని కాల్చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement