Monday, March 25, 2024

ఇంధన ట్యాంకర్‌ బోల్తా.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరు దుర్మరణం

ఇంధనం ట్యాంకర్‌ బోల్తా పడడంతో ఇంధనం తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఖర్గోన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో ఇండోర్‌ నుంచి ఖర్గోన్‌ వైపు వెళ్తున్న ఇంధన ట్యాంకర్‌ అంజన్‌గావ్‌ గ్రామం సమీపంలో మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఇంధన ట్యాంకర్‌ గమనించిన కొందరు ట్యాంకర్లోని ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లారు. ఇంధన ట్యాంకర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement