Thursday, April 25, 2024

సుశీ లావాదేవీలపైన జీఎస్టీ అధికారుల దృష్టి.. వేగంగా జరుగుతున్న రికార్డుల పరిశీలన ప్రక్రియ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నగరంలోని సుశీఇన్‌ఫ్రా దాని అనుబంధ 16 సంస్థలకు చెందిన రికార్డులను అధికారులు వేగంగా పరిశీలిస్తున్నారు. ముగ్గురు అదనప కమిషనర్ల నేతృత్వంలో 16 సంస్థలకు చెందిన ఫైల్స్‌ను దాదాపు వంద మంది అధికారులు పరిశీలిస్తున్నారు. 20కి పైగా సంస్థలను గుర్తించినప్పటికీ కొన్ని సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడంలేదని, మరికొన్ని చిరునామా మార్చుకుని కొనసాగిస్తుండడంతో వాటిలో తనిఖీలు నిర్వహించలేకపోయినట్లు తెలుస్తోంది. అందులో నల్గొండ పట్టణంలో సుశీ ఎలక్ట్రికల్స్‌ పేరున ఓ సంస్థ ఉన్నట్లు తమ వద్ద ఉన్న వివరాలతో ఆ చిరునామాకు వెళ్లగా అధికార పార్టీకి చెందిన నాయకులు నివాసం ఉన్నట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇలా మరో ఒకట్రెండు కంపెనీల చిరునామాలు తమ వద్ద ఉన్న వివరాలకు సంబంధం లేకుండా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అయితే ఇప్పటికే అదనపు కమిషనర్లు సంయుక్తరాణి, సాయికిషోర్‌, సునీతల పర్యవేక్షణలో దస్త్రాల పరిశీలన కొనసాగుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాణిజ్య పన్నుల కమిషనర్‌ నీతు ప్రసాద్‌తో పాటు మరికొంత మంది అధికారులు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్‌ పరికరాలల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా వెలికి తీశారు. దానిని హార్డ్‌ డిస్క్‌ల్లోకి ఎక్కించి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ లావాదేవీల్లో తేడాలు ఉన్నాయి, రిటర్న్‌లు వేసిన వివరాలకు వాళ్ల వద్ద ఉన్న వివరాలకు ఏమైనా తేడా ఉందా తదితర వివరాలను పరిశీలన చేస్తున్నారు.

రాజ్‌టీవిలో పెట్టిన పెట్టుబడులు, రాబడుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోని సమాచార సేకరణపై వంద మందికి పైగా అధికారులు పనిచేస్తున్నారు. త్వరతగతిన అధ్యయనం పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఉదయం 10గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దస్త్రాల పరిశీలనకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేధిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement