Saturday, April 20, 2024

మహిళల టీ 20కి రంగం సిద్దం.. ఆదోని మహిళ టీమిండియాకు ఎంపిక

ఆస్ట్రేలియా మహిళలతో జరగనున్న టీ 20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. తాజాగా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ ప్రీత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ దూరమైంది. అయితే ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్‌ కర్నూల్‌ జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి ఎంపికైంది.


టీమ్‌ ఇండియాకు అంజలి శర్వాణి ఎంపిక పట్ల ఆదోని ప్రాంతంలో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్‌వైపు అడుగులు వేసిన అంజలి అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement