Friday, March 29, 2024

శాంతించిన క‌రోనా.. త‌గ్గుతున్న కేసులే నిద‌ర్శ‌నం..

తెలంగాణలో క‌రోనా మ‌రింత‌ శాంతించింది. బుధ‌వారం ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,79,279 మంది కోలుకున్నారు. ఇంకా 4,396 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్ప‌టిదాకా 4,110 మంది చ‌నిపోయిన‌ట్టు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement