Thursday, April 25, 2024

సాగర్ లో నామినేషన్లకు ఆఖరి క్షణాలు !!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇక ఇప్పటికే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో 20 నుంచి 23 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అలాగే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్లు వేయనున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి ,తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నామినేషన్ వేయనున్నారు.

మరోవైపు బిజెపి అభ్యర్థి రవికుమార్ కూడా నామినేషన్ వేయనున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే రాజాసింగ్, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు వెళ్లనున్నారు. ఇక ఈనెల 31తో నామినేషన్ల స్క్రూట్నీ ముగుస్తుంది. వచ్చే నెల ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement