Thursday, April 18, 2024

గాలిలో పెళ్లి చేసుకున్న జంట.. మరి శోభనం ఎక్కడ చేసుకుంటారో?

తమిళనాడు మదురైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు.. తమ పిల్లల పెళ్లిని అంగరంగ వైభవంగా చేద్దామనుకున్నారు. కానీ కరోనా వల్ల ఆ అవకాశం కుదరలేదు. దీంతో వారు అదిరిపోయే ఐడియా వేశారు. ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. 161 మందితో విమానం మదురై నుంచి తూత్తుకుడికి బయలుదేరింది. వధూవరులు రాకేష్, దక్షిణ జంట, కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే విమానం ఎక్కారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయించి నెగిటివ్‌‌గా తేలిన తర్వాతే ప్రయాణానికి అనుమతించారు. అనుకున్న ముహూర్తానికి వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. విమానం తూత్తుకుడికి వెళ్లి మళ్లీ తిరిగి మదురైకి చేరుకుంది. అలా గాల్లోనే ఇరుకుటుంబాల మధ్య ఈ జంట ఒక్కటైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సదరు జంట పెళ్లిని గాల్లో అయితే చేసుకున్నారు.. మరి శోభనం ఎక్కడ చేసుకుంటారో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement