Thursday, March 28, 2024

దేశంలో అతి పెద్ద విధ్వంసం ఇదే – బిజెపిపై కేజ్రీవాల్ ఫైర్

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విధ్వంస‌మ‌ని మండిప‌డ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అక్ర‌మ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజ‌ర్ల‌తో ప్ర‌జ‌ల ఇండ్లు, దుకాణాల‌ను కూల్చివేయ‌డం స‌రైంది కాద‌న్నారు. ఢిల్లీలో కాషాయ పార్టీ బుల్డోజ‌ర్లు ఇదే త‌ర‌హాలో తిరిగితే నగ‌రంలో 63 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌వుతార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కూల్చివేస్తోంద‌ని కేజ్రీవాల్ చెప్పారు. ఈ ప్ర‌క్రియ‌లో కీల‌క అంశాల‌ను గుర్తుంచుకోవాల‌ని చెబుతూ ఢిల్లీలో ప్ర‌జ‌లు త‌మ ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను చూపినా కూల్చివేత‌లు కొన‌సాగిస్తున్నార‌ని ఆరోపించారు. ఢిల్లీలోని మురికివాడ‌లు, గుడిసెల‌ను నేల‌మ‌ట్టం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను బిజెపి ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement