Saturday, April 20, 2024

ఆ విమానం టైర్ దొరికిందోచ్!


ప్రభ న్యూస్ : చోరీకి గురైన భారత వైమానిక దళానికి చెందిన మిరేజ్ యుద్ధవిమానం టైర్ ఎట్టకేలకు దొరికింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బక్షిక తలాబ్ వైమానిక స్థావరంనుంచి రాజస్థాన్ లోని జోధ్ పూర్ వైనానిక స్థావరానికి తరలిస్తుండగా ఈ టైర్ ను ఎవరో దొంగిలించారు.

లక్నో సమీపంలోని షహీద్ మార్గంలో వెడుతూండగా కొద్ది సేపు ఆగినప్పుడు తన ట్రక్ లోంచి గుర్తు తెలియని వ్యక్తులు విమానం టైర్ ను దొంగిలించినట్లు డ్రైవర్ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఆ టైర్ ను రోడ్డుపై గుర్తించిన పోలీసులు వైమానిక దళానికి అప్పగించారు. నవంబర్ 27న ఈ చోరీ జరగ్గా డిసెంబర్ 4న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement