Friday, April 26, 2024

65 ఏళ్ల వృద్ధురాలిపై ఆ ప‌ని.. కామాంధుడికి జీవిత ఖైదు..

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్య‌క్తి 65 ఏళ్ల వృద్ధురాలిపై ఆ ప‌నికి పూనుకున్నాడు. వయోభేదాలు మరచి ముస‌ల‌మ్మ‌పై అఘాత్యానికి ఓడగట్టిన నిందితుడికి జీవితఖైదు విధిస్తూ వ‌రంగ‌ల్‌ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కె.శైలజ తీర్పునిచ్చారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమళ్ల‌ గ్రామనికి చెందిన నిందితుడు మహ్మద్ అక్బర్ (38) కు జీవిత ఖైదుతో పాటు బాధితురాలికి ఒక లక్ష నష్ట పరిహారం చెల్లించాలని, అలాగే 5 వేల జరిమానా కూడా విధించారు.

2017 జూన్ 7న, రఘునాథపల్లి మండలానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు, ఆమె భర్త పనిపై వెళ్లి జూన్ 7 సాయంత్రం కోమళ్ల బస్ స్టాండ్ లో దిగారు. వయోవృద్ధుడైన త‌న భర్తను అదే గ్రామంలో వైండింగ్ పనిచేసే అక్బర్ బండిపై ఇంటి వ‌ద్ద‌ దింపి రావాలని ఆమె కోరింది. అలాగే భర్తను దింపి వచ్చి, ఆ త‌ర్వాత ఆ వృద్ధురాలిని బండిపై ఇంటికి తీసుకెళుతానని చెప్పి, పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017 జూన్ 8 న, బాధితురాలు రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐ పి సి 376, 382, 327, 506కింద‌ కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును సీఐ ఆర్.సంతోష్ , ఎస్సై వీరేంద‌ర్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ మొయిజుద్దీన్ తగిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టగా, పీపీ భిక్షపతి కేసును వాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement