Saturday, April 20, 2024

Test Match: 60 ఓవ‌ర్ల‌లో 205 ర‌న్స్.. కివీస్ టార్గెట్ ఇదే..

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు చివ‌రి రోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 284 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్‌.. అయిదో రోజు లంచ్ బ్రేక్ టైమ్‌కి వికెట్ న‌ష్టానికి 79 ర‌న్స్ చేసింది. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి సోమ‌ర్‌విల్లీ 36, టామ్ లాథ‌మ్ 35 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన సోమ‌ర్‌విల్లీని ఉమేశ్‌యాదవ్ పెవిలియ‌న్‌కు పంపించాడు. 39 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి న్యూజిలాండ్ 87 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ప్ర‌స్తుతం టామ్ లాథ‌మ్‌, కేన్ విలియ‌మ్స్ క్రీజులో ఉన్నారు.

ఇవాళ తొలి సెష‌న్‌లో న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. దీంతో మ్యాచ్ ర‌స‌వ‌త్త‌ర దిశ‌గా వెళ్తోంది. ఇంకా రెండు సెష‌న్స్‌లో దాదాపు 60 ఓవ‌ర్లు ఇండియా బౌల్ చేయాల్సి ఉంటుంది. 60 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ గెల‌వాలంటే ఇంకా 205 ర‌న్స్ చేయాలి. ఒక‌వేళ ఇండియా లంచ్ త‌ర్వాత వికెట్ల‌ను త్వ‌ర‌గా తీస్తే అప్పుడు మ్యాచ్‌ను కైవ‌సం చేసుకునే చాన్స్ ఉంది. కానీ కివీస్ బ్యాట‌ర్లు ఆడుతున్న తీరు డ్రా అయ్యే ఆలోచ‌న‌ల్ని కూడా రేకెత్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement