Wednesday, April 24, 2024

అంతర్జాతీయ ఉగ్రవాదులుగా అల్‌ఖైదా, పాకిస్థాన్‌ తాలిబాన్‌లకు చెందిన ఉగ్రవాదులు

అల్‌ఖైదా, పాకిస్థాన్‌ తాలిబాన్‌లకు చెందిన నలుగురు నేతలను అమెరికా గ్లోబల్‌ టెర్రరిస్టులుగా ప్రకటించింది. న్యూఢిల్లిdలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్‌పై ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ మంత్రివర్గ సమావేశం జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత ఈ పరిణామం జరిగింది. అల్‌ఖైదా, పాకిస్తానీ తాలిబాన్‌ గ్రూపులకు చెందిన నలుగురిని అమెరికా గ్లోబల్‌ టెర్రరిస్టులుగా గుర్తించిందని, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు శిక్షార్హత లేకుండా పనిచేయకుండా బిడెన్‌ పరిపాలన నిర్ధారిస్తోందని విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్‌ స్పష్టం చేశారు.

ఉగ్రవాదులు ఒసామా మెహమూద్‌, భారత ఉపఖండంలోని అల్‌ఖ్ఖైదా, డిప్యూటీ ఎమిర్‌ అతిఫ్‌ యాహ్యా గౌరీ, గ్రూప్‌ రిక్రూటింగ్‌ శాఖకు బాధ్యత వహిస్తున్న ముహమ్మద్‌ మారుఫ్‌గా తేల్చారు. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కార్యకలాపాలు, ఉగ్రవాదులను పర్యవేక్షిస్తున్న తెహిక్‌ ఇతాలిబాన్‌ పాకిస్తాన్‌ (టిటిపి) డిప్యూటీ ఎమిర్‌ ఖారీ అవ్జూద్‌పై కూడా ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

- Advertisement -

”అఫ్ఘనిస్తాన్‌లో అంతర్జాతీయ ఉగ్రవాదుల శిక్షణ పనిచేయకుండా చూడాలనే మా నిబద్ధతను నిలబెట్టుకోవడానికి మేము అన్ని సంబంధిత సాధనాలను ఉపయోగిస్తామని బ్లింకెన్‌ చెప్పారు. ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదానికి వేదికగా ఉపయోగించకుండా చూసేందుకు చేసే చర్యలలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపుల నుండి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి తమ పూర్తి ఉగ్రవాద నిరోధక సాధనాలను ఉపయోగించడానికి కట్టడి చేస్తామన్నారు. సెప్టెంబరు 2014లో స్థాపించబడిన ఒక ఇస్లామిక్‌ మిలిటెంట్‌ సంస్థ, ఇది ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించడానికి పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఇండియా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ ప్రభుత్వాలతో పోరాడాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement