Thursday, March 28, 2024

పంజాబ్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

పంద్రాగస్టు వేళ భారీఉగ్ర కుట్రను పంజాబ్‌ పోలీసులు భగ్నం చేశారు. పాక్‌ ఐఎస్‌ఐ మద్దతుతో విధ్వంసానికి సిద్ధమైన ఉగ్రవాద చర్యను ఢిల్లి పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి కెనడాకు చెందిన అర్ష్‌ దల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్‌ సింగ్‌తో సంబంధమున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు 9 ఎంఎం పిస్టల్స్‌, 40 లైవ్‌ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పంజాబ్‌ డీజీపీ ఆదివారం మీడియాకు వెల్లడించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్‌ నిఘా విభాగం గ్యాంగ్‌స్టర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌, అలియాస్‌ అర్ష్‌దల్లా సన్నిహితులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అర్ష్‌దల్లా స్వస్థలం మోగా. ప్రస్తుతం ఇతను కెనడాలో ఉంటున్నాడు. ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్‌ ఇతను. చాలాకాలంగాఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇతనిపై అభియోగాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement