Thursday, April 25, 2024

Telangana | మహబూబాబాద్‌ జిల్లాలో ఘోరం.. వైద్యం వికటించి మూడు నెల‌ల బాలుడి మృతి

మ‌హ‌బుబాబాద్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మూడు నెలల బాలుడు చ‌నిపోయాడు. ఈ ఘటన కేసముద్రం మండలం రంగాపురంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన భూక్య బీరన్న మహేశ్వరి దంపతుల చిన్న కుమారుడు పండుకు జ్వరం వ‌చ్చింది. దీంతో ఆర్‌ఎంపీ డాక్టర్‌ భూక్యా హాలు ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు.

ఆయ‌న ఇంజక్షన్‌ వేసి ఇంటికి పంపించాడు. కొద్ది సేపటికి బాలుడి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు చ‌నిపోయాడు. ఆర్‌ఎంపీ డాక్టర్ వేసిన‌ ఇంజక్షన్‌ వికటించి బాలుడు చ‌నిపోయాడ‌ని బంధువులు ఆరోపించారు. చిన్నారి చావుకు కారణమైన ఆర్‌ఎంపీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement