Thursday, April 18, 2024

తక్షణమే పదో తరగతి… ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేయాలి

కరోనా సెకెండ్ వేవ్ విజృంభించి లక్షల మంది బాధపడుతున్న విపత్కర సమయంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే మొండి వైఖరితో ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు విద్యార్ధులను, వారి తల్లితండ్రులను ఆందోళనలోకి
నెట్టివేశారని…. ఈ వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ వీర మహిళ విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలు మేరకు కోవిడ్ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీర మహిళ విభాగం నేతలు, సభ్యురాళ్ళు తమ ఇళ్లలోనే దీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళ నేతలు మాట్లాడుతూ…కరోనా రెండవ దశ ఉధృతి భయాందోళనలు కలిగిస్తోంది. ఇల్లు దాటాలంటేనే భయపడుతున్నాం. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారమే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వమే కేంద్ర స్థాయిలో సి.బి.ఎస్.ఈ. పరీక్షలను రద్దు చేశారు. పలు రాష్ట్రాలు కూడా విద్యార్ధులకు పరీక్షలు రద్దు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రజల కోసం పాలన చేయాలి కానీ.. శవాలపై కాదు.
ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై మరోసారి పునరాలోచన చేయాలని. పరీక్షలను రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్ధి సంఘాలు, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలిసి ప్రజాస్వామ్యయుతంగా
ఉద్యమిస్తాం.

కరోనా పరీక్షలు నిలిపేశారు…విద్యార్థులకు మాత్రం పరీక్షలా?

కరోనా నియంత్రణ చర్యల్లో తీవ్రంగా విఫలమై… కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేక వాటిని నిలిపివేసిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. చేతకాక కరోనా పరీక్షలు నిలిపివేసి విద్యార్ధులకు మాత్రం పరీక్షలుపెట్టడం జగన్ రెడ్డి గారి
ప్రభుత్వ మూర్ఖత్వాన్ని తెలియచేస్తుంది అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పి.యశస్విని, శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినుత కోట, పార్టీ మహిళ నేతలు ఘంటసాల వెంకట లక్ష్మి, రావి సౌజన్య, ఆకేపాటి సుభాషిణి తదితరులతోపాటు పిఠాపురం, అమలాపురం, విజయవాడ, తిరుపతి, నిడదవోలు, ఏలూరు, ఉండి, దెందులూరు, కదిరి, రైల్వేకోడూరు, మదనపల్లి తదితర నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టిన ఈ దీక్షలకు సంఘీభావంగా జనసేన తెలంగాణ వీర మహిళ విభాగం నేతలు హైదరాబాద్ లో దీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement