Friday, April 19, 2024

చివరిదాకా టెన్షన్ టెన్షన్.. భారత్దే గెలుపు!

న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20లో ఇవ్వాల ఉత్కంఠ నెలకొంది. చివరిదాకా టెన్షన్ కొనసాగింది. మరో బంతి ఉందనగానే సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టి ఆటను ఫినిష్ చేశాడు. దీంతో న్యూజిలాండ్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ సిరీస్లో న్యూజిలాండ్1, భారత్ 1 మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి. ఎల్లుండి అహ్మదాబాద్ వేదికగా జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ అవుతుంది. అయితే.. టీమిండియా సిరీస్ని కైవసం చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక.. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ (11), ఇషాన్ కిషన్ (19), రాహుల్ త్రిపాఠి (13), వాషింగ్టన్ సుందర్ (10) పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ పాండ్యా 15 పరుగులతో నాటౌట్గా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement